నెల్లూరు జిల్లాలో లారీ ఢీకొని నలుగురు కార్మికులు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/ACCIDENT-IN-NELLORE-DIST.jpg)
గుడ్లూరు (CLiC2NEWS): నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారి మధ్యలోని గ్రీనరీని కట్ చేస్తున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. జిల్లాలోని గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందారు. వీరంతా మన్నేటికోట, బాగల్లు సింగరాయకొండ ప్రాంత వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.