శ్రీ‌కాళ‌హ‌స్తి సమీపంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..

లారీని టెంపో ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో న‌లుగురు మృతి

శ్రీ‌కాళ‌హ‌స్తి (CLiC2NEWS): రేణిగుంట‌-నాయుడుపేట ప్ర‌ధాన ర‌హ‌దారిపై టెంపో వాహ‌నం లారీని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందారు. ఎనిమిది మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను శ్రీ‌కాళ‌హ‌స్తి ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ చ‌ర్యలు చేప‌ట్టారు. టెంపో డ్రైవ‌ర్ మద్యం తాగి వాహ‌నం న‌డ‌ప‌డం వ‌ల‌నే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.