గువ్వ‌ల చెరువు ఘాట్ రోడ్డులో ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

గువ్వ‌ల చెరువు (CLiC2NEWS): వైఎస్ ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు మృతి చెందారు. గువ్వ‌ల చెరువు ఘాట్‌రోడ్డులో చింత‌కొమ్మ‌దిన్నె ప‌రిధిలో కారు-కంటైన‌ర్‌ను ఢీ కొట్ట‌డంతో  ప్ర‌మాదం చోటుచేసుకుంది. కారులో ప్ర‌యాణిస్తున్న న‌లుగురితోపాటు కంటైన‌ర్ డ్రైవ‌ర్ మృతి చెందిన‌ట్లు స‌మాచారం. వీరంతా చ‌క్రాయ‌పేట మండ‌లం కొన్నేప‌ల్లికి చెందిన వారుగా గుర్తించారు. వీరు బంధువుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లి వ‌స్తుండ‌గా వీరు ప్ర‌యాణిస్తున్న కారు కంటైన‌ర్‌ను ఢీకొట్టింది.

Leave A Reply

Your email address will not be published.