అదుపుతప్పి లోయలో పడిన టెంపో.. 10 మంది మృతి

డెహ్రాడూన్ (CLiC2NEWS): ఉత్తరాఖండ్లోని రైటోలి సమీపంలో రిషికేష్-బద్రినాథ్ హైవే ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రుద్రప్రయాగ్ వైపు వెళుతున్న టెంపో వాహనం శనివారం అదుపుతప్పి లోయలోని అలనంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ఈ లోయ దాదాపు 150 నుండి 200 మీటర్ల లోతు ఉంది. ప్రమాద సమయంలో వామనంలో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్తితి విషమంగా ఉన్నట్లు సమాచారం.