బెంగళూరు తొక్కిసలాట ఘటన.. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

బెంగళూరు (CLiC2SNEWS): ఆర్సిబి విజయోత్సవ కార్యక్రమంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చోటుచేసుకున్న తొక్కిసలాట కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సిఎం సిద్దరామయ్య దిగ్భ్రాంది వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ఉచిత వైద్యం అందజేస్తామన్నారు.