మంత్రి కెటిఆర్ దావోస్ పర్యటన.. తెలంగాణకు రూ. 21వేల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ దావోస్ పర్యటన సందర్భంగా తెలంగాణకు రూ. 21వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో భాగంగా నాలుగు రోజుల పర్యటన విజయవంతమైనట్లు మంత్రి తెలిపారు. ఈ నాలుగు రోజుల్లో 52 వాణిజ్య సమావేశాలు, ఆరు రౌండ్ టేబుల్ సమావేశాలు, రెండు ప్యానల్ డిస్కషన్లలో ఆయన పాల్గొన్నట్లు తెలిపారు. పలు దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని.. మొత్తంగా రాష్ట్రానికి రూ. 21వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు.