దేశంలోని అత్యుత్తమ బ్యాంక్గా ఎస్బిఐ

SBI: దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిలిచింది. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఎస్బిఐను బెస్ట్ బ్యాంక్గా ఎంపిక చేసింది. ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి ఈ అవార్డును అందుకున్నారు. వాహింగ్టన్లో జరిగిన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశంలో 31వ వార్షిక ఉత్తమ బ్యాంక్ అవార్డుల కార్యక్రమంలో అవార్డు అందించారు. అసాధారణ సేవలు అందించి కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడంలో తమ బ్యాంక్ ముందంజలో ఉందని ఎస్బిఐ పేర్కొంది.