న‌దిలో ప‌డిన ఆర్మీ వాహ‌నం.. ఏడుగురు జ‌వాన్లు దుర్మ‌ర‌ణం

శ్రీ‌నగ‌ర్ (CLiC2NEWS): ఆర్మీ జ‌వాన్లుప్ర‌యాణిస్తున్న వాహ‌నం అదుపు త‌ప్పి న‌దిలో ప‌డిపోయింది. శుక్ర‌వారం ల‌ద్దాఖ్‌లోని ష్యోక్ న‌దిలో ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఏడుగురు జ‌వాన్లు మృతి చెందారు. మిగ‌తా జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పార్తాపూర్ శిబిరం నుంచి 26 మంది సైనికులు వాహ‌నంలో హ‌నీఫ్ స‌బ్ సెక్టార్ వైపు వెళ్తుండ‌గా ఈ ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది.

టుర్టుక్ సెక్టార్ ప్రాంతంలో జ‌వాన్లు ప్ర‌యాణిస్తోన్న వాహ‌నం ప్ర‌మాద‌వ‌శాత్తు ష్యోక్ న‌ది వ‌ద్ద స్కిడ్ అయి న‌దిలో ప‌డిపోయింది.
స‌మాచారం అందుకున్న స‌హాయంక సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని గాయ‌ప‌డిన జ‌వాన్ల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ ఏడుగురు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆర్మీ అధికారులు వెల్ల‌డించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన వారిని ఎయిర్ అంబులెన్స్‌లో వెస్ట్ర‌న్ క‌మాండ్‌కు త‌ర‌లిస్తామ‌ని ఆర్మీ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.