అశ్రునయనాల మధ్య ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు..

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రయలు ముగిశాయి. హైదరాబాద్లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. సిరివెన్నెల చితికి ఆయన పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వరశర్మ నిప్పంటించారు. ఈ ఉదయం సిరివెన్నె భౌతిక కాయాన్ని ఆయన నివాసం నుంచి ఫిలింఛాంబర్కు తీసుకొచ్చారు. అక్కడ సిరివెన్నెల పార్థీవ దేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం సిరివెన్నెల అంతిమయాత్ర కు టాలీవుడ్ ప్రముఖులందరూ కన్నీటి వీడ్కోలు పలికారు.
ఇవాళ ఉదయం ఫిల్మ్ ఛాంబర్లో ఆయన భౌతికకాయం.. అభిమానుల సందర్శనార్థం ఉంచారు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున సహా సినీ ప్రముఖులందరూ సిరివెన్నెలను కడసారి చూసేందుకు అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో తమకున్న అనుబంధాన్ని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు.