రేపు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేషహోమం టికెట్లు విడుదల..
తిరుమల (CLiC2NEWS): నవంబరు 23వ తేదీ నుండి అలిపిరిలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీశ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ప్రకటనలో తెలిపింది. దీనికోసం టికెట్లను రేపు మధ్యాహనం 2 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. హిందూ సనాతన ధర్మప్రచారంలో భాగంగా ఈ అలిపిరిలో ఈ హోమం జరపనున్నట్లు పేర్కొన్నారు. టికెట్ ధర రూ. వెయ్యిగా నిర్ణయించారు. అయితే ఒక టికెట్పై ఇద్దరిని అనుమతినిస్తారు. బుధవారం హోమం ఏర్పాట్లను జెఇఒ వీరబ్రహ్యం పరిశీలించారు. హోమం నిర్వహణకు, వచ్చే భక్తులకు కూర్చునేందుకు వీలుగా తగు ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు.