అంకుర సంస్థల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ కీలక ఒప్పందం
హైదరాబాద్ (CLiC2NEWS): అంకుర సంస్థల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బ్రెజిల్కు చెందిన గోయాస్ హబ్తో టిహబ్ ఎంఒయు కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో ఐటి మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. దీని ద్వారా రాష్ట్రనికి చెందని స్టార్టప్లకు బ్రెజిల్లో, బ్రెజిల్కు చెందిన స్టార్టప్లకు హైదరాబాద్లో అవకాశాలు లభించనున్నట్లు సమాచారం. ఎఐ, అగ్రిటెక్, ఐటి, హెల్త్కేర్, బయోటిక్, మైనింగ్ రంగాల్లో పరస్పరం సహకరించుకునేలా ఒప్పందం జరిగింది.