ప‌రీక్ష‌ల కోసం విద్యార్థుల‌ను క్రేన్‌తో త‌ర‌లింపు

నందిగామ (CLiC2NEWS):  హైద‌రాబాద్ – విజ‌య‌వాడ జాతీయ రాహ‌దారిపై నందిగామ వంతెన వ‌ద్ద మున్నేరు వ‌ర‌ద ఉధృతిగా  ప్ర‌వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలో వాహ‌నాలు రాక‌పోక‌లు నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. అయితే శుక్ర‌వారం డిగ్రీ కాలేజ్ సెమెస్ట‌ర్ ఎగ్జామ్స్ ఉండ‌టంతో ప‌రీక్ష రాసేందుకు విద్యార్థులు వ‌చ్చారు. వ‌ర‌ద ప్ర‌వాహం ఉండ‌టం వ‌ల‌న‌ ఏ వాహ‌నాలు వంతెన దాటే ప‌రిస్థితి లేక‌పోయింది. దీంతో పోలీసులు క్రేన్ స‌హాయంతో విద్యార్థుల‌ను అవ‌తలివైపుకు త‌ర‌లించారు. మరోవైపు ప‌ల్ల‌గిరి కొండ స‌మీపంలో గురువారం మ‌ధ్యాహ్నం మున్నేరు వ‌ర‌ద‌ల్లో ముగ్గురు వ్య‌క్తులు గ‌ల్లంత‌య్యారు. వారిని ఎన్‌డిఆర్ ఎస్ బృందాలు సుర‌క్షితంగా ర‌క్షించిన‌ట్లు స‌మాచారం.

హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ నేష‌న‌ల్ హైవేపై వ‌ర‌ద‌నీరు..

Leave A Reply

Your email address will not be published.