శుభాంశు శుక్లా వ‌ల్ల విలువైన స‌మాచారం వ‌చ్చింది: ఇస్రో ఛైర్మ‌న్‌

క‌ర్నూలు (CLiC2NEWS): క‌ర్నూలు ట్రిపుల్ ఐటి స్నాత‌కోత్స‌వానికి ఇస్రో ఛైర్మ‌న్ నారాయ‌ణ‌న్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇస్రో ఆధ్వ‌ర్యంలో ఎన్నో అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. శుభాంసు శుక్లాను ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ స్టేష‌న్‌కు పంపి క్షేమంగా తిరిగి ర‌ప్పించ‌డం వ‌లన గ‌గ‌న్ యాన్ మిష‌న్కు ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మైన స‌మాచారం వ‌చ్చింద‌ని తెలిపారు. ఈ సంవ‌త్స‌రాన్ని గ‌గ‌న‌యాన్ సంవ‌త్స‌రంగా ప్ర‌క‌టించామ‌న్నారు. రాకెట్‌లో ప్ర‌యాణం చేసేట‌పుడు అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డితే , క్షేమంగా బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌యోగం చేస్తున్నామ‌ని..దీని కోసం శుక్లా, ప్ర‌శాంత్ నాయ‌ర్‌కు ప‌ది నెల‌ల పాటు శిక్ష‌ణ ఇస్తున్నామ‌ని తెలిపారు. నాసా, ఇస్రో ఆధ్వ‌ర్యంలో 12 రాకెట్ల‌ను రూపొందిస్తున్నామ‌ని, దీనికి ప్ర‌ధానిమంత్రి న‌రేంద్ర‌మోడీ అన్ని ర‌కాలుగా ప్రోత్సాహం ఇస్తున్నార‌ని నారాయ‌ణ‌న్ వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.