2021-22 నీట్ పిజి కౌన్సెలింగ్‌కు సుప్రీంకోర్టు అనుమ‌తి

ఢిల్లి (CLiC2NEWS): నీట్ పిజి కౌన్సెలింగ్‌కు ఉన్న‌త న్యాయ‌స్థానం అనుమ‌తి నిచ్చింది. 2021-22 సంవ‌త్స‌రానికి నీట్ పిజి ప్ర‌వేశాల‌కు ప్ర‌స్తుతం ఉన్న రిజ‌ర్వేష‌న్ల ప్ర‌కార‌మే కౌన్సెలింగ్ నిర్వ‌హించాల‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. ఒబిసిల‌కు 27%, ఈడ‌బ్ల్యూ ఎస్‌ల‌కు 10% రిజ‌ర్వేష‌న్‌కు ధ‌ర్మాస‌నం అనుమ‌తిచ్చింది. వార్షికాదాయం 8ల‌క్ష‌ల లోపు ఉన్న‌వారికి ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ వ‌ర్తింప జేయాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది.
పిజి వైద్య‌విద్య ప్ర‌వేశాల్లో 8 ల‌క్ష‌ల వార్షిక ఆదాయం కంటే త‌క్కువ ఉన్నవారు ఈడ‌బ్ల్యూఎస్ కోటాకు ఆర్హులంటూ గ‌త సంవ‌త్స‌రం జూలైలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేష‌న్ ను స‌వాల్ చేస్తూ పిజి వైద్య విద్యార్థులు సుప్రీంకోర్గును ఆశ్ర‌యించారు. ఈమేర‌కు ఉన్న‌త న్యాయ‌స్థానం శుక్ర‌వారం తీర్పు నిచ్చింది.

Leave A Reply

Your email address will not be published.