తెలంగాణ డిజిపి అంజనీకుమార్ సస్పెండ్..!

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ డిజిపి అంజనీకుమార్ ని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని.. ఆయన్ని సస్సెండ్ చేసినట్లు సమాచారం. మరో ఇద్దరు అదనపు డిజిలు సందీప్ కుమార్ జైన్, మహేశ్ భగవత్ కు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా రేవంత్ రెడ్డిని కలవడంపై ఇసి ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ని కలవడంపై విచారణ ఇవ్వాలని ఐసి ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పదవికి రాజీనామా చేశారు. కెసిఆర్ రాజీనామా లేఖను గవర్నర్కు పంపారు.