రాజభవన్లో తేనీటు విందు.. సిఎం రేవంత్, మిస్వరల్డ్ సుచాత, మంత్రులు..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో తేనీటి విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిఎం రేవంత్ రెడ్డి , మంత్రులు పొన్నం ప్రభాకర్ , జూపల్లి కృష్ణారావు, సిఎస్ , డిజిపి, మిస్ వరల్డ్ ఓపల్ సుచాత.. ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ 2025 కిరీటం దక్కించుకున్న థాయిలాండ్ సుందరి ఓపల్ సచాతను గవర్నర్ సత్కరించారు. ఆమెతో పాటు మొదటి రన్నరప్ హాసెట్ డెరెజి (ఇథియోపియా) , రెండో రన్నరప్గా నిలిచిన మయా క్లైడా (పోలాండ్) , మూడు స్థానాల్లో రన్నరప్గా నిలిచిన ఆరేలి జోచిమ్ (మార్టినిక్) కూడా ఈ విందులో పాల్గొన్నారు.