TS: నేటి నుంచి విధులకు టీచర్లు

హైదరాబాద్ (CLiC2NEWS): నేటి నుంచి ఉపాధ్యాయులు, సిబ్బంది పాఠశాలలకు రావాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయులతో పాటు.. జూ. కళాశాలల లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది విధులకు హాజరు కావాలని ఆదేశించింది. దాదాపు 3 నెలల తర్వాత వీరంతా తిరిని విధుల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి ఆన్లైన్/ ఆఫ్ లైన్ తరగతులు ప్రారంభం అవుతుండడంతో ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది.