తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు: సిఎం కెసిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన చర్యలు చేపట్టాలని సిఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. భారత సామాజిక దార్శనికుడు, రాజ్యాంగ నిర్మాత, మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి పెట్టడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు.