త‌హ‌సీల్దార్ ఆఫీస్ ఎదుట గొంతు కోసుకున్న రైతు

అనంత‌పురం (CLiC2NEWS): త‌హ‌సీల్దార్ ఆఫీస్ ముందు ఓ రైతు గొంతు కోసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న అనంత‌పురం జిల్లాలోని బొమ్మ‌న‌హాళ్ లో చోటు చేసుకుంది. పోలీసులు రైతును కాపాడి బ‌ళ్లారి విమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. తార‌కాపురంకు చెందిన‌ గ‌డ్డం సుంక‌న్న అనే రైతు.. త‌న పొలం స‌మ‌స్య‌పై 15 ఏళ్ల నుండి త‌హ‌సీల్దార్ కార్యాల‌యం చుట్టూ తిరుగుతున్నా న్యాయం జ‌ర‌గ‌లేద‌ని ఈ చ‌ర్య‌కు పాల్ప‌డినట్లు స‌మాచారం.

క‌ల్లుదేవ‌న‌హ‌ళ్లి రెవెన్యూ గ్రామ పరిధిలో 6.68 ఎక‌రాల భూమిని 1974లో సుంక‌న్న‌ తండ్రి లింగ‌ప్ప కొనుగోలు చేశార‌న్నారు. ఇందులో శాంత‌కుమార్ కొ ఎక‌రం, న‌ర‌సింహులు అనే వ్య‌క్తి 1.5 ఎక‌రా క‌బ్జా చేశార‌ని ఆరోపించారు. ఈ విష‌యం న్యాయం చేయాల‌ని కోరుతూ గ‌త 15 ఏళ్లుగా త‌హ‌సీల్దార్ కార్యాల‌యం చుట్టూ తిరుగుతున్నా ప‌ట్టించుకోలేద‌ని వాపోయారు. పైగా తిరిగి త‌మ‌పైనే ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కింద కేసు న‌మోదు చేయించారిని తెలిపాడు. సుంకన్న పొలం త‌గాదా కేసు హైకోర్టులో పెండింగ్లో ఉంద‌ని త‌హ‌సీల్దార్ మునివేలు వెల్ల‌డించారు. 2023లో ఆయ‌నే కోర్టును ఆశ్ర‌యించారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.