ఎపిలో యోగా దినోత్సవం జరుపుకునేందుకు ఎదురుచూస్తున్నా: ప్రధాని మోడీ

ఢిల్లీ (CLiC2NEWS): ప్రజలలో యోగాపై అవగాహన కల్పించేందుకు ఎపి ప్రభుత్వం మే 21 నుండి జూన్ 21 వరకు యోగాంధ్ర – 2025 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దానిలో భాగంగా చిత్తూరు సమీపంలోని పులిగుండు ట్విన్హిల్స్లో దాదాపు 2 వేల మందికి పైగా యోగాసనాలు వేశారు. ఈ ఫొటోలను కేంద్ ఆముష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ ఎక్స్లో షేర్ చేయగా.. దానిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రీట్వీట్ చేశారు. ఎపిలో యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఎపి ప్రజల కృషి ప్రశంసనీయమని కొనియాడారు. అక్కడి ప్రజల్లో యోగా దినోత్సవం పట్ల ఉన్న ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా ఎపిలో జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. యోగాను నిత్య జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు.