India Corona: కొత్తగా 2,47,417 కేసులు

న్యూఢిల్లీ (CLiC3NEWS): దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా 5 వేలకు పెరిగాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా దాదాపు 18 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపగా 2,47,417 మందికి వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రి త్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. దీంతో రోజు వారి పాజిటివిటి రేటు 12.11 శాతానికి పెరిగింది.
- తాజా కేసులతో కలిపి దేశంలోమొత్తం కేసుల సంఖ్య 3,63,17,927 కి చేరింది.
- ఇప్పటి వరకు దేశంలో 3,47,15,361 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో 380 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు.
- ఇప్పటి వరకు దేశంలో 4,85,035 మంది కరోనాతో మరణించారు.
- ప్రస్తుతం దేశంలో 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- తాజా వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 5488కి పెరిగింది.
- వీరిలో 2162 మంది బాధితులు కోలుకున్నారు.
- గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 620 మందిలో కొత్త వేరియంట్ను గుర్తించారు.