ఢిల్లీలో భారీగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు
న్యూఢిల్లీ (CLIC2NEWS): దేశ రాజధాని న్యూఢిల్లీలో విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవాళ (బుధవారం) నాటికి ఈ కొత్త వేరియంట్ కేసులు దేశంలో 781కి పెరిగాయి. ఈ మేరకు బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. కాగా ఢిల్లీలో బాధితుల సంఖ్య 238కి పెరిగింది.
నిన్న ఒక్కరోజే ఢిల్లీలో 73మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది.
మహారాష్ట్రలో 167 కేసులున్నాయి.
తెలంగాణ 62
రాజస్థాన్ 46
తమిళనాడు 34
కర్ణాటక 34
ఇప్పటి వరకు దేశంలో 241 మంది బాధితులు కోలుకున్నారు.