Telangana: బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినేట్ ఆమోదం..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన మంత్రి వర్గ సమావేశం ముగిసింది. సమావేశంలో మంత్రివర్గం బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రేపటి నుండి శాసనసబ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో సోమవారం ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి హరీశ్రావు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రగతిభవన్లో ప్రత్యేకంగా సమావేశమైన కెబనేట్.. బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది.