1 నుంచి టోల్ బాదుడు
అమరావతి (CLiC2NEWS): ఎపిలో ఉన్న 58 టోల్ ప్లాజాల్లో వచ్చే నెల (ఏప్రిల్) 1వ తేదీ నుంచి టోల్ బాదుడు మొదలు కానుంది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లో ప్రతి ఆర్థిక సంవత్సరంలో టోల్ రుసుములు సమీక్షిస్తారు. ఈ సారి 5 నుంచి పది శాతం మేర పెరగనున్నట్లు ఎన్ హెచ్ ఏ ఐ (జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ) అధికారులు తెలిపారు.