ఫేస్‌బుక్ లింక్ ఓపెన్ చేస్తే.. రూ. 34 ల‌క్ష‌లు మాయం

ఒంగోలు (CLiC2NEWS): ఫేస్‌బుక్‌లో క‌నిపించిన లింక్‌ని ఓపెన్ చేసిన ఓ బ్యాంకు ఉద్యోగి త‌న బ్యాంకు ఖాతాలోని రూ. 34 ల‌క్ష‌లు పోగొట్టుకున్నారు. ప్ర‌కాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ బ్యాంకు మ‌హిళా ఉద్యోగి షేర్ మార్కెట్‌లో పెట్టుబ‌డులు పెడితే లాభాలు వ‌స్తాయంటూ వ‌చ్చిన లింక్‌పై క్లిక్ చేశారు. వెంట‌నే విడ‌త‌ల వారిగా రూ. 34 ల‌క్ష‌లు ఆమె ఖాతా నుండి బ‌దిలీ అయిపోయాయి. సైబ‌ర్ నేర‌గాళ్లు ఏదో ఒక ర‌కంగా సులువుగా డ‌బ్బును కాజేస్తున్నారు. ఇటీవ‌ల ఒక మ‌హిళ‌తో ఇడి దాడులు జ‌రుగుతాయని న‌మ్మించి, దానిని త‌ప్పించుకోవాడానికి డ‌బ్బులు వ‌సూలు చేశారు మోస‌గాళ్లు. అంతేకాకుండా మ‌రో మ‌హిళ ఖాతానుండి ప్ర‌భుత్వ ప‌థ‌కం కింద డ‌బ్బులు జ‌మ కానున్నాయని.. డ‌బ్బులు కాజేశారు.

Leave A Reply

Your email address will not be published.