రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండొద్దు: సిఎం రేవంత్రెడ్డి

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు ఉండకూడదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. వేసవిలో విద్యుత్ తాగునీటి సరఫరాపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కొరత లేకుడా వెంటనే చర్యలు చేపట్టాలని , జూన్ వరకు బోర్లు, బావులు, ఇతర స్థానిక నీటి వనరులు వాడుకోవాలన్నారు. కార్పొరేషన్లలో వాటర్ ట్యాంకులు సిద్దంగా ఉంచాలని.. ట్యాంకర్లు బుక్ చేస్తే 12 గంటల్లోపు చేరేలా చూడాలన్నారు. పెరిగిన డిమాండ్కు తగినట్టు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. దీనికోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని సిఎం ఆదేశించారు.