ఆదిలాబాద్ లో పిడుగుపాటుకు ముగ్గురు మృతి

ఆదిలాబాద్ (CLiC2NEWS): ఆదిలాబాద్ జిల్లా పిడుగులతో దద్దరిల్లింది. నిన్నటి నుండి తెలగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందారు…. నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు.
- జిల్లాలోని బజార్హత్నూర్ మండలం బుర్కపల్లి గ్రామంలో పిడుగుపాటుకు బనియా గరన్ సింగ్ (45) , ఆశాబాయి (30) అక్కడికక్కడే మృతి చెందారు.
- అలాగే బండల్ నాగపూర్లో పిడుగుపాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
- జిల్లాలోని బీమ్పూర్ మండలం పిప్పల్ కోటిలో పిడుగుపాటుకు ఒక ఎద్దు ప్రాణాలు కోల్పోయింది.
- జైనథ్ మండలం సాంగ్వి కే గ్రామంలో పిడుగుపాటుకు పదిహేను మేకలు మృతిచెందాయి.