వ‌రంగ‌ల్‌లో రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

వ‌రంగ‌ల్ (CLiC2NEWS): జిల్లాలోని బొల్లికుంట‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్ల‌వారు జామున బొల్లికుంట వ‌ద్ద ఆటోను గుర్తు తెలియ‌ని వాహ‌నం ఢీ కొన‌డంతో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉన్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ద‌వాఖానాకు త‌ర‌లించారు. మృతుల‌ను వ‌ర్ద‌న్న‌పేట‌కు చెందిన కూర‌గాయ‌ల వ్యాపారులుగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.