AP: క‌లుషిత ఆహారం తిన్న న‌లుగురు విద్యార్థులు మృతి

అన‌కాప‌ల్లి (CLiC2NEWS): జిల్లాలోని కోట‌వుర‌ట్ల మండ‌లం కైలాస ప‌ట్ట‌ణంలోని అనాథాశ్ర‌మంలో క‌లుషితాహారం తిన్న విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వీరిని అస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స నందిస్తున్నారు. వారిలో న‌లుగురు సోమ‌వారం మృతి చెందిన‌ట్లు స‌మాచారం. రెండు రోజుల క్రితం స‌మోసా తిని మొత్తం 27 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వీరిలో న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు . మిగిలిన వారికి న‌ర్సీప‌ట్నం, అన‌కాప‌ల్లి ఆసుప‌త్రుల‌లో చికిత్స‌నందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.