అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముగ్గురు విద్యార్థుల మృతి
రంపచోడవరం (CLiC2NEWS): ఆదివారం సెలవు దినం కావటంతో సరదాగా వాగులోకి ఈతకు దిగిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం ఐ. పోలవరంలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా గోవరం మండలం కె. ఎర్రంపాలెం కు చెందిన పదో తరగతి చదివే ముగ్గురు విద్యార్థులు సీతపల్లి వాగులోకి దిగి మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.