‘సర్కారు వారి’.. ట్రైలర్ రిలీజ్..

హైదరాబాద్ (CLiC2NEWS): మహేష్బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుద లైన టీజర్, పాటలలో మహేశ్ క్లాస్ అండ్ మాస్లుక్లో కనిపించాడు. తాజాగా చిత్ర బృందం ట్రైలర్ను విడుదల చేసింది. మహేశ్ ఈ చిత్రంలో మరింత యంగ్గా కనిపిస్తున్నారు. వెన్నెల కిశ్ర్తో కలిసి చేసిన కామెడీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంను నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. తమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.