TS: ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ లేఖ
రబీ ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలి

హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీకి ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారు. భారత ఆహార సంస్థ (ఎఫ్సిఐ) తీరుతో రాష్ట్రాల్లో గందరగోళం నెలకొందని, ధాన్యం కొనుగోలు విషయంలో ఎఫ్సిఐకి ఆదేశాలివ్వాలని లేఖలో కోరారు. 2020-21 రబీలో మిగిలిన 5 లక్షల మెట్రిక్టను్న ధాన్యంకొనుగోలు చేయాలని వినతి చేశారు. వచ్చే రబీలో రాష్ట్రం నుండి ఎంత ధాన్యం కొంటారో తెలపాలని కోరారు.
వ్యవసాయ రంగంలో అద్భుతమైన అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి, వ్యవసాయరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది అని సిఎం పేర్కొన్నారు. వినూత్న విధానాలతో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న వరుస పథకాల మూలంగానే వ్యవసాయ రంగం ధృఢంగా తయారై ఇంతటి అభివృద్ధి సాధ్యమైందన్నారు. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తును పూర్తి ఉచితంగా అందిస్తూ, ఏడాదికి ఎకరానికి రూ. 10,000 పంటపెట్టుబడి ప్రోత్సాహకాన్ని తెలంగాణ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. కష్టజీవి అయిన తెలంగాణ రైతు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుంటూ గుణాత్మకంగా దిగుబడిని సాధిస్తున్నాడు. తద్వారా దేశ ప్రగతికి దోహదం చేస్తున్నాడు అని సిఎం కెసిఆర్ తన లేఖలో వెల్లడించారు.