తెలంగాణ‌లో మ‌రో రెండు నోటిఫికేష‌న్లు..

ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్టు శాఖ‌లో కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్

హైదార‌బాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో మ‌రో రెండు విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైయ్యాయి. పోలీసు ర‌వాణా విభాగం, ఎక్సైజ్ శాఖ‌లో కలిపి 677 కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు పోలీసు నియామ‌క మండ‌లి నోటిఫికేష‌న్ జారీ చేసింది. వీటిలో ఎక్సైజ్ శాక‌లో 614 పోస్టులు, పోలీసు ర‌వాణా విభాగంలో 63 కానిస్టేబుల్ పోస్టుల భ‌ర్తీ చేయ‌నున్నారు. మే 2వ తేది నుండి 20 వ‌ర‌కు ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు.

పోలీసు శాఖ‌లో ఇప్ప‌టికే 16,614 పోస్టుల భ‌ర్తీకి పోలీసు నియామ‌క మండ‌లి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిన‌దే. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామ‌క మండ‌లిఛైర్మ‌న్ వి.వి. శ్రీ‌నివాస‌రావు నాలుగు నోటిఫికేష‌న్లు జారీ చేశారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు www.tslprb.in వెబ్‌సైట్ ద్వారా మే 2 నుండి 20 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. ఉద్యోగాల వారీగా విద్యార్హ‌త‌లు, వ‌యో ప‌రిమితి, సిల‌బ‌స్ త‌దిత‌ర వివ‌రాలు వెబ్‌సైట్‌లో పొందుప‌రిచార‌ని తెలిపారు. యూనిఫాం పోస్టుల‌కు ఈ నోటిఫికేష‌న్‌లో మూడేళ్ల గ‌రిష్ట వ‌యోప‌రిమితి స‌డ‌లింపు క‌ల్పించింది.

Leave A Reply

Your email address will not be published.