మెద‌క్‌ జిల్లాలో పెళ్లింట విషాదం..

పాప‌న్న‌పేట (CLiC2NEWS): పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో ప్ర‌యాణిస్తున్న ట్రాక్ట‌ర్ బోల్తా ప‌డి ఇద్ద‌రు మృతి చెందారు. మెద‌క్ జిల్లాలోని పాప‌న్న‌పేట మండ‌లం పాచారం గ్రామం నుండి ఆందోల్‌కి పెళ్లి బృందం ట్రాక్ట‌ర్‌లో బ‌య‌లుదేరారు. పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వారంతా బ‌య‌లుదేరారు. మ‌న్సాన్‌ప‌ల్లి వ‌ద్ద‌కు రాగానే ట్రాక్ట‌ర్ అదుపుత‌ప్పి బోల్తాప‌డింది. ఈప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతి చెంద‌గా.. మిగిలిన వారికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గాయ‌ప‌డిన వారిలో ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.