కొత్త‌గూడ ఫ్లైఓవ‌ర్ నుండి కింద‌ప‌డి ఇద్ద‌రు యువ‌కులు మృతి

గ‌చ్చిబౌలి (CLiC2NEWS): న‌గ‌రంలోని గ‌చ్చిబౌలి పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ప్లైఓవ‌ర్ పై నుండి కింద‌ప‌డి ఇద్ద‌రు యువ‌కులు మృతి చెందారు. ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళుతున్న ఇద్ద‌రు య‌వ‌కులు ప్ర‌మాద‌వ‌శాత్తూ కొత్త‌గూడ ప్లైఓవ‌ర్‌పై నుండి ప‌డిపోయారు. స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితంలేక పోయింది. చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్లు స‌మాచారం. మ‌ర‌ణించిన వారు ఎపిలోని గుంటూరు జిల్లాకు చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ రోహిత్‌, జాబ్ సెర్చింగ్‌లో ఉన్న‌ బాల ప్ర‌స‌న్నగా పోలీసులు గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.