బ్యాంక్ నుండి క్యాషియ‌ర్ న‌గ‌దుతో ప‌రారీ కేసులో ట్విస్ట్‌..!

హైద‌రాబాద్ (CLiC2NEWS): వ‌న‌స్థ‌లిపురం బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో న‌గ‌దు మాయమైన ఘ‌ట‌న‌లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌క్యాషియ‌ర్ ప్ర‌వీణ్‌.. తాను న‌గ‌దు తీసుకెళ్ల‌లేదంటూ సెల్ఫీ వీడియో విడుద‌ల చేశారు. బ్యాంకు లావాదేవీల్లో త‌క్కువ‌గా వ‌చ్చిన న‌గ‌దును తాను చోరీ చేసిన‌ట్లు ఆరోపిస్తున్నార‌ని ప్ర‌వీణ్ వీడియోలో వివ‌రించారు.

గ‌త రెండు నెల‌లుగా న‌గ‌దు త‌క్కువ‌గా వ‌స్తున్న విష‌యం మేనేజ‌ర్ దృష్టికి తీసుకెళ్లినా ప‌ట్టించుకోలేదని, మేనేజ‌ర్ నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే ఈ ప‌రిస్థితి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం 3.30 గంట‌ల స‌మ‌యంలో క‌డుపునొప్పి రావ‌డంతో ఇంటికి వెళ్తున్నాన‌ని చెప్పి బ్యాంకు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాను. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో త‌న‌కు తెలియ‌ద‌ని వెల్ల‌డించాడు. బ్యాంకు మేనేజ‌ర్‌, సిబ్బంది క‌లిసి సేఫ్ లాక‌ర్‌లో న‌గ‌దు తీసి నాపై త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. నేను బ్యాంకులో నుండి వెళ్లిన స‌మ‌యంలో సిసి కెమెరాల‌తో పాటు సేఫ్ లాక‌ర్‌లో బీరువాకు ఉండే సిసి కెమెరాల‌ను ప‌రిశీలిస్తే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని వీడియోలో ప్ర‌వీణ్ వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.