బందీల‌ను విడుద‌ల‌చేస్తేనే గాజాకు నీరు, విద్యుత్ ఇంధ‌నం: ఇజ్రాయెల్‌

జెరూస‌లెం (CLiC2NEWS): ఇజ్రాయెల్‌.. గాజాకు విద్యుత్ , ఇంధ‌న స‌ర‌ఫ‌రా నిలిపివేసిన సంగ‌తి తెలిసిందే. హ‌మాస్ వ‌ద్ద బందీలుగా ఉన్న పౌరుల‌ను సౌనికుల‌ను సుర‌క్షితంగా విడుద‌ల చేస్తేనే నీరు, విద్యుత్‌, ఇంధ‌నం పుర‌రుద్ధ‌రిస్తామ‌ని ఇజ్ర‌యెల్ ప్ర‌క‌టించింది. వారికి ఎటువంటి హానీ జ‌రిగిన త‌గిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందిన హెచ్చ‌రించింది. హ‌మాస్ ఉగ్ర‌వాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి కొంత‌మందిని బందీలుగా తీసుకుపోయారు. హ‌మాస్ దాడి చేసిన రెండో రోజే గాజాను ఇజ్రాయెల్ అష్ట‌దిగ్భంధ‌నం చేసింది. వారికి నీరు, ఔష‌ధాలు, విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేసింది.

Leave A Reply

Your email address will not be published.