శంషాబాద్లో మహిళ హత్య

శంషాబాద్ (CLIC2NEWS): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఉంటుపల్లి ఇంద్రనగర్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా ఒంటరిగా ఉంటున్న యాదమ్మ (35) అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోనే గొంతుకోసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.