యూట్యూబ‌ర్ జ‌స్బీర్ ఫోన్‌లో 150 పాక్ నెంబ‌ర్లు.

‘జాన్ మ‌హల్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వ‌హిస్తున్న జ‌స్బీర్ సింగ్‌ను గూఢ‌చ‌ర్యం కేసులో పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. జ‌స్బీర్‌.. పంజాబ్‌లోని రూప్‌న‌గ‌ర్ జిల్లా మ‌హ్లాన్ గ్రామానికి చెందినవాడు. రిమాండ్‌లో ఉన్న అత‌డి నుండి పోలీసులు ప‌లు కీల‌క విష‌యాలు రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. అత‌ను ఆరు సార్లు పాకిస్థాన్‌ను సంద‌ర్శించిన‌ట్లు .. అత‌ని మొబైల్‌లో పాక్‌కు చెందిన 150 నెంబ‌ర్లు ఉన్న‌ట్లు పోలీసుల విచార‌ణంలో తేలింది. అత‌ను త‌న లాప్‌టాప్‌ను ఒక గంట పాటు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధ‌దికారికి ఇచ్చిన‌ట్లు స‌మాచారం. పాక్ ఐఎస్ ఐ ఏజెంట్ డానిష్‌తో సంబంధాలు కొన‌సాగిస్తున్నాడ‌ని గుర్తించారు. త‌న స్నేహితురాలి ద్వారా డానిష్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌టిన‌ట్లు జ‌స్పీర్ కోర్టులో తెలిపాడు. అంతేకాకుండా డానిష్ త‌న‌కు కొన్ని సిమ్ కార్డులు పంపించాల‌ని ఆదేశించాడ‌ని కూడా వెల్ల‌డించాడు.

పాక్‌కు గూఢ‌చ‌ర్యం కేసులో ఇటీవ‌ల యూట్యూబ‌ర్ జ్యోతి మ‌ల్హోత్రా ను ఆరెస్టు చేశారు. అనంత‌రం ఢిల్లీలోని పాకిస్థాన్ హైక‌మిష‌న్‌లో ప‌నిచేస్తున్న డానిష్‌పై అనుమానాలు బ‌ల‌ప‌డ‌టంతో అత‌డిని దేశం నుండి బ‌హిష్క‌రించారు. దీంతో భార‌త్‌లో యూట్యూబ‌ర్ల తీగ లాగే క్ర‌మంలో జ‌స్బీర్ ను కూడా అరెస్టు చేశారు.

Leave A Reply

Your email address will not be published.