అమర సైనికులకు ప్రధాని నివాళి

న్యూఢిల్లీ : 1971లో ఇండో-పాక్ యుద్ధానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ జ్యోతిని వెలిగించి అమర సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, త్రివిధ దళాల అధిపతులు ఎంఎం నరవణే, ఆర్కేసింగ్ బదౌరియా, కరమ్బీర్ సింగ్ నివాళులర్పించారు. ఈ విజయ జ్యోతులను దేశ నలుమూలలకు తీసుకెళ్లేలా రక్షణ శాఖ ఏర్పాట్లు చేసింది. 1971 యుద్ధంలో పాల్గొని అవార్డులందుకున్న జవాన్ల గ్రామాలకు పంపేలా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా ఏడాది పాటు స్వర్ణ విజయ సంబరాలు నిర్వహించనున్నారు.