భారత్‌లో కొత్తగా 36,595 కరోనా కేసులు

న్యూఢిల్లీ: భార‌త్‌లో గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 40 వేల‌కు దిగువ‌నే న‌మోద‌వుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 36,595 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 95,71,559 కి చేరింది. గత 24 గంటల్లో 42,916 మంది కరోనా నుండి కోలుకున్నారు. గడచిన 24 గంటల సమయంలో 540 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో కోవిడ్‌ మృతుల సంఖ్య 1,39,188 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 90,16,289 మంది కోలుకున్నారు. 4,16,082 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

Leave A Reply

Your email address will not be published.