మ‌హారాష్ట్రలో 3,913 కరోనా కేసులు.. 93 మరణాలు

ముంబ‌యి: దేశంలో క‌రోనా వ్యాప్తి త‌గ్గిన‌ప్ప‌టికీ రోజూ కేసుల సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఇంకా ప‌లు రాష్ర్టాల్లో క‌రోనా కేసులు బారీ సంఖ్య‌లోనే న‌మోద‌వుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో మంగళవారం నుంచి బుధవారం వరకు కొత్తగా 3,913 కరోనా కేసులు, 93 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,06,371కు మరణాల సంఖ్య 48,969కు పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 7,620 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,01,700కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 54,573 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.

Leave A Reply

Your email address will not be published.