ఆటో-లారీ ఢీ.. ఆరుగురు మృతి

నూజివీడు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన ఆదివారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతులంతా నూజివీడు మండలం లయన్‌తండాకు చెందిన కూలీలుగా గుర్తించారు. గాయపడ్డవారిని విజయవాడ, నూజివీడు ద‌వఖానాల‌కు త‌ర‌లించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.