మెట్రోలో విజ‌య‌వంతంగా గుండె త‌ర‌లింపు

హైదరాబాద్‌: గుండె మార్పిడి శస్త్ర చికిత్స కోసం తొలిసారిగా వైద్యులు హైదరాబాద్ మెట్రోరైలును వినియోగించారు. విజ‌య‌వంతంగా ఎల్బీనగర్‌ కామినేని నుంచి జూబ్లీహిల్స్‌ అపోలోకు గుండెను తరలించారు. ట్రాఫిక్ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు వీలుగా గ్రీన్ ఛాన‌ల్ ద్వారా త‌ర‌లింపు ప్ర‌క్రియ చేప‌ట్ఆరు. కాగా నల్లగొండ జిల్లాకు చెందిన 45 ఏళ్ల రైతు నర్సిరెడ్డి బ్రెయిన్‌డెడ్‌ కావడంతో ఆయన కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో గుండె అవసరమున్న వ్యక్తికి డాక్టర్‌ గోఖలే నేతృత్వంలో శస్త్రచికిత్స చేయనున్నారు.

అయితే ట్రాఫిక్‌ సమస్య కారణంగా గుండె తరలింపు జాప్యం అయ్యే అవకాశం ఉన్నందున, నాగోల్ నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్‌తో పీఏ సిస్టమ్ టెక్నాలజీ ద్వారా గుండె తరలించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. గుండెను కామినేని ఆస్ప‌త్రి నుంచి నాగోల్ వ‌ర‌కు రోడ్డు మార్గంలో.. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వ‌ర‌కు మెట్రో రైలులో తీసుకెళ్లారు. జూబ్లీ చెక్ పోస్టు మెట్రో స్టేష‌న్ నుంచి అపోలో ఆస్ప‌త్రి వ‌ర‌కు రోడ్డు మార్గంలో తీసుకెళ్లారు.

(హైద‌రాబాద్ మెట్రోలో గుండె త‌ర‌లింపు..)

Leave A Reply

Your email address will not be published.