హైద‌రాబాద్ మెట్రోలో గుండె త‌ర‌లింపు..

హైద‌రాబాద్ : ‌హైద‌రాబాద్ మెట్రో రైలులో తొలిసారి బ్రెయిన్ డెడ్ అయిన మ‌నిషి గుండెను త‌ర‌లించేందుకు ఏర్పాట్లు చేశారు వైద్యులు. న‌గ‌రంలో విప‌రీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ నేప‌థ్యంలో గుండె త‌ర‌లింపున‌కు వైద్యులు హైద‌రాబాద్ మెట్రోను ఎంచుకున్నారు. దీంతో న‌గ‌రంలో మొద‌టిసారిగా మెట్రోతో గ్రీన్ ఛాన‌ల్‌ను నిర్వ‌హిస్తున్నారు.

న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన 45 ఏండ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మరో వ్య‌క్తికి అమ‌ర్చ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న మ‌రో వ్య‌క్తికి గుండె మార్పిడి శ‌స్ర్త‌చికిత్స‌కు వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్ట‌ర్ గోకులే నేతృత్వంలో ఈ శ‌స్ర్త‌చికిత్స నిర్వ‌హించ‌నున్నారు. ఎల్బీన‌గ‌ర్ కామినేని ఆస్ప‌త్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి గుండెను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి 3 గంట‌ల మ‌ధ్య‌లో త‌ర‌లించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.