మహారాష్ట్రలో కొత్తగా 2,910 కరోనా కేసులు

ముంబయి: మహారాష్ట్రలో ప్రతి రోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,910 కరోనా కేసులు నమోదు కాగా.. తాజాగా 52 మరణాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,87,678కు, మరణాల సంఖ్య 50,388కు పెరిగింది. అలాగే గత 24 గంటల్లో 3,039 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,84,127కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 51,965 యాక్టివ్ కేసులు ఉన్నట్లు బులిటెన్లో వెల్లడించారు.