మ‌హారాష్ట్రలో 3,314 కరోనా కేసులు.. 66 మరణాలు

ముంబ‌యి: మహారాష్ట్రలో కరోనా ఉధృతి త‌గ్గిన‌ప్ప‌టికీ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అదే స్థాయిలో మ‌ర‌ణాలు కూడా సంభ‌విస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 3,314 కరోనా కేసులు, 66 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,19,550కు, మరణాల సంఖ్య 50 వేలకుపైగా పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో 2,124 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 18,09,948కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 59,214 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.

Leave A Reply

Your email address will not be published.