రాజేంద్ర‌న‌గ‌ర్‌లోని ప‌హ‌ల్ పుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్ర‌మాదం

 

హైద‌రాబాద్ (CLiC2NEWS): న‌గ‌రంలోని రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధి కాటేదాన్ ప‌హ‌ల్ పుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఫ్యాక్ట‌రీలో మంట‌లు 3 అంత‌స్తుల వ‌ర‌క వ్యాపించాయి. పై అంత‌స్తులో ప్యాకింగ్ సామాగ్రి ఉన్న‌ట్లు స‌మాచారం. స‌మాచారం అందుకున్న ఫైరింజ‌న్ట సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని మంట‌లు ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌మాద స‌మ‌యంలో వంద మందికి పైగా సిబ్బంది విధులు నిర్వ‌హిస్తున్నారు. వారంతా అప్ర‌మ‌త్త‌మై బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు. అగ్ని ప్ర‌మాద ధాటికి భ‌వ‌నం పూర్తిగా ప‌క్క‌కు ఒరిగిపోయింది.

Leave A Reply

Your email address will not be published.