భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి!

భద్రాచలం (CLiC2NEWS): ఈ మ‌ధ్య కురిసిన భారీ వ‌ర్షాల‌తో గోదావరి నదిలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరుగుతున్నది. రాములవారి పాదాల చెంత గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

ప్రస్తుతం 43.50 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహిస్తున్నది. 9,07,616 క్యూసెక్కుల నీరు పారుతున్నది. లొత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు
అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.