India Corona: 23,529 కొత్తకేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 23,529 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 3,37,39,980కు చేరింది.
- గత 24 గంటల్లో 28,718 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- ఇప్పటి వరకు దేశంలో 3,30,14,898 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- గత 24 గంటల్లో కొత్తగా 311 మంది మృతిచెందారు.
- ఇప్పటి వరకు దేశంలో 4,48,062 మంది బాధితులు ప్రాణాలొదిరారు.
- ప్రస్తుతం దేశంలో 2,77,020 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
- కొత్తగా నమోదైన కేసుల్లో అధికంగా కేరళలోనే ఉండటం గమనార్హం. రాష్ట్రంలో నిన్న 12,161 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 155 మంది కరోనాకు బలయ్యారని తెలిపింది.
- ఇక దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 65,34,306 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.
- ఇప్పటివరకు 88,34,70,578 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్యశాఖ పేర్కొన్నది.